ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 44 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజా బులెటిన్ను విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,671కు చేరింది. తాజాగా నమోదైన జిల్లాలో ఏడు కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం 10,240 సాంపిల్స్ను పరీక్షించగా.. 44 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇవాళ 41 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కాగా ప్రస్తుతం 767 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. కరోనాతో 56 మంది మరణించారు. ఇక విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 62 మందికి, అలాగే మిగిలిన రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 153 మందికి కరోనా పాజిటవ్ సోకినట్లు తాజాగా విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు.
Read This Story Also: స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సెట్స్పైకి వెళ్లే మొదటి చిత్రం ఏదంటే..!
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2671 పాజిటివ్ కేసు లకు గాను 1848 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 767. #APFightsCorona
— ArogyaAndhra (@ArogyaAndhra) May 25, 2020