అమరావతిని ప్రశ్నార్థకంగా మార్చేశారు.. జగన్ పై బాబు ఫైర్

| Edited By:

Aug 28, 2019 | 8:48 PM

ఏపీ ప్రభుత్వం పై చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఉండాలని అమరావతిని ఎంచుకున్నామని.. ఇప్పుడు అమరావతి మనుగడ లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారని వారి త్యాగాలను గుర్తించడం లేదన్నారు. అమరావతి పై నీలినీడలు కమ్ముకోవడంతో యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు తరలిపోతున్నారని చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు […]

అమరావతిని ప్రశ్నార్థకంగా మార్చేశారు.. జగన్ పై బాబు ఫైర్
Follow us on

ఏపీ ప్రభుత్వం పై చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఉండాలని అమరావతిని ఎంచుకున్నామని.. ఇప్పుడు అమరావతి మనుగడ లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారని వారి త్యాగాలను గుర్తించడం లేదన్నారు. అమరావతి పై నీలినీడలు కమ్ముకోవడంతో యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు తరలిపోతున్నారని చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు మిగులు విద్యుత్ ఉండే పరిస్థితి తీసుకొచ్చానని.. ఇప్పుడు కరెంట్ కోతల దుస్థితి దాపురించిందని ఆయన ఫైర్ అయ్యారు. గుంటూరులో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన.. తెలంగాణలో నాయకులు మాత్రమే పార్టీని వీడి వెళ్లారని కార్యకర్తలు కాదన్నారు. కార్యకర్తల నుంచే నాయకుల్ని తయారు చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. త్వరలోనే తెలంగాణలో పర్యటించి పార్టీని పునర్నిర్మిస్తామన్నారు.