Amravathi : అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ..ఆ ప్రాంత రైతులు, ప్రజలు చేస్తోన్న ఆందోళనలు 71వ రోజుకి చేరుకున్నారు. అమరావతి ఐక్క కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ప్రజలు రోజుకో రకంగా నిరసనను తెలుపుతున్నారు. పండుగలు, పెళ్లిళ్లలో సైతం తమ ఆందోళలను కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఓ రాజధాని ప్రాంత యువకుడు పెళ్లి కార్డుపై ‘జై అమరావతి’ అనే నినాదాన్ని ముద్రించి అందరికి పంచిపెట్టాడు. తాజాగా తుళ్లూరులో బుధవారం జరిగిన ఓ పెళ్లి వేడుక..’అమరావతి’ నిరసన ప్రదర్శనకు వేదికైంది. వధూవరులతో పాటు..పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులంతా ప్లకార్డులు చేతబూని ‘జై అమరావతి’ నినాదాలు చేశారు.