ఏపీలో విస్త‌రిస్తోన్న క‌రోనా..కొత్త‌గా 79 పాజిటివ్‌ కేసులు

|

Jun 03, 2020 | 1:05 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో విస్త‌రిస్తోన్న క‌రోనా..కొత్త‌గా 79 పాజిటివ్‌ కేసులు
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్‌ను టెస్ట్ చేయ‌గా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. ఇవికాక‌ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మంది .. విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కోవిడ్-19 నిర్థారణ అయ్యింది. ఇవి కూడా లెక్క‌గ‌డితే 24 గంట‌ల్లో 180 కేసులు న‌మోద‌యిన‌ట్లు అవుతుంది. ఇక‌ ఇప్పటివరకు మొత్తం 3279 కోవిడ్-19 కేసులు న‌మోద‌య్యాయి. కాగా రాష్ట్రంలో క‌రోనాతో మొత్తం 68 మంది మృతి చెందారు. వ్యాధి న‌య‌మై వివిధ ఆస్ప‌త్రులు నుంచి 2244మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య‌ 967గా ఉంది.