జగనన్నా.. మా నాన్న, తాతను చంపేస్తారట: సీఎంకు లేఖ రాసిన చిన్నారి

| Edited By:

Sep 14, 2019 | 2:39 PM

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న గొడవల నేపథ్యంలో వాటిని వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌కే లేఖ రాసింది ఓ చిన్నారి. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం మత్య్సకార గ్రామానికి చెందిన కోడూరి పుష్ప అనే నాల్గవ తరగతి చిన్నారి రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేఖలో పుష్ప.. ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు నమస్కరించి వ్రాయునది ఏమనగా.. అన్నా.. నా పేరు కోడూరి పుష్ప. నాకు ఒక చెల్లెలు. పేరు గాయత్రి. ఒక తమ్ముడు. […]

జగనన్నా.. మా నాన్న, తాతను చంపేస్తారట: సీఎంకు లేఖ రాసిన చిన్నారి
Follow us on

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న గొడవల నేపథ్యంలో వాటిని వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌కే లేఖ రాసింది ఓ చిన్నారి. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం మత్య్సకార గ్రామానికి చెందిన కోడూరి పుష్ప అనే నాల్గవ తరగతి చిన్నారి రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ లేఖలో పుష్ప.. ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు నమస్కరించి వ్రాయునది ఏమనగా.. అన్నా.. నా పేరు కోడూరి పుష్ప. నాకు ఒక చెల్లెలు. పేరు గాయత్రి. ఒక తమ్ముడు. పేరు హేమంత్. మా అమ్మనాన్నల పేర్లు కోడూరి రాజు, జానకీ, మా తాత నానమ్మల పేర్లు కోడూరి వెంకటేశ్వర్లు, మంగమ్మ. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో మేము ఉంటున్నాము. ఈ నెల 4వ తేదీ నుంచి మా స్కూల్లో మాతో పాటు చదువుకుంటున్న పిల్లలు ఎవరూ మా ముగ్గురితో మాట్లాడట్లేదు. ఎవరైనా మాతో మాట్లాడితే రూ. 10వేలు ఫైన్ వేస్తారని చెబుతున్నారు. మమ్మల్ని ఊర్లో వెలివేశారంట. ఇప్పుడు ఎవరూ స్కూలుకు రావట్లేదు. మాతో మాట్లాడట్లేదు. మాతో ఆడట్లేదు. మాకు చదువుకోవాలని ఉంది. మాకు ఆడుకోవాలని ఉంది. మా నాన్నను, మా తాతను చంపేస్తారని మా స్నేహితులు చెబుతున్నారు. మాకు చాలా భయంగా ఉంది’’ అని పుష్ప ఆ లేఖలో పేర్కొంది.