Andhra Pradesh: రైలు టాయిలెట్ లో చిన్నారి.. అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లిన తల్లి

|

May 11, 2022 | 1:47 PM

విశాఖపట్నం(Visakhapatnam) లో అమానవీయం ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు పట్ల ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. మాతృప్రేమగా మాయని మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించింది. ఎలాంటి కనికరం లేకుండా....

Andhra Pradesh: రైలు టాయిలెట్ లో చిన్నారి.. అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లిన తల్లి
child in train toilet
Follow us on

విశాఖపట్నం(Visakhapatnam) లో అమానవీయం ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు పట్ల ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. మాతృప్రేమగా మాయని మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించింది. ఎలాంటి కనికరం లేకుండా చిన్నారిని రైలులోని టాయిలెట్ లో వదిలేసి వెళ్లిపోయింది. విశాఖలోని బొకారో ఎక్స్‌ప్రెస్(Bokaro Express) రైలులో ఈ ఘటన జరిగింది. రైలులో శిశువుకు జన్మనిచ్చిన ఓ మహిళ.. చిన్నారిని రైలులోని టాయిలెట్‌లోనే వదిలేసింది. వాష్ రూమ్ కు వెళ్లిన ప్రయాణికులు చిన్నారిని చూసి షాక్ అయ్యారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో రైలు వద్దకు చేరుకున్న ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు శిశువును అక్కున చేర్చుకున్నారు. అనంతరం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Coconut Milk Tea: కొబ్బరి పాలతో తయారు చేసిన టీ ఎప్పుడైనా తాగారా? మీ చర్మ కాంతి..

Ram Charan: రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద.. ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్..