Andhra Pradesh: పంది మాంసం పచ్చిది తింటానని పందెం.. నిష్కారణంగా పోయిన ప్రాణం

|

Jun 22, 2022 | 6:28 PM

పచ్చి పంది మాంసం తినటానికి పందెం కాసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది.

Andhra Pradesh: పంది మాంసం పచ్చిది తింటానని పందెం.. నిష్కారణంగా పోయిన ప్రాణం
A representative image
Follow us on

Srikakulam District: సరదా కోసం చేసిన ఓ పని.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పందానికి పోయి.. ప్రాణం తీసుకున్నాడు ఓ వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి(Tekkali)లో ఈ ఘటన చోటుచేసుకుంది.  యర్ర ఈశ్వరరావు చిరు వ్యాపారి ఆంధ్రా వీధిలో నివాసం ఉంటున్నాడు. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం పంది మాంసం కొనేందుకు షాపుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న పచ్చి మాంసం  ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతని ఫ్రెండ్స్ మరో ముక్క తినాలని సదారాకి పందెం కాశారు. ఆ పందాన్ని ప్రస్టేజ్‌గా తీసుకున్నాడు ఈశ్వరరావు. ఎలాగైనా పందెం గెలవాలనుకున్న ఈశ్వరరావు మరో ముక్కను నోట్లో వేసుకున్నాడు. అది గొంతుకు అడ్డం పడింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. దీంతో టెన్షన్ పడిన అతని ఫ్రెండ్స్.. వెంటనే ఓ రిక్షాపై హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.  ఇంటి పెద్దదిక్కును కోల్పోవటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఏ చేసిన ఓ పని.. ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. కాగా..ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

 

మృతుడు ఈశ్వరరావు (Fiel Photo)

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి