కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో మళ్లీ 200 దాటిన కేసులు.. ఏకంగా..!

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 222 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5858కు చేరింది. 

కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో మళ్లీ 200 దాటిన కేసులు.. ఏకంగా..!
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 1:59 PM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 222 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5858కు చేరింది.  ఇందులో రాష్ట్రంలో కొత్తగా 186 కేసులు ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రాల్లో రెండు మరణాలు(కృష్ణా జిల్లాలోనే రెండు మరణాలు) సంభవించాయి. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. అలాగే 2,591 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో తాజాగా 14,477 పరీక్షలు నిర్వహించగా.. అందులో 186 కొత్త కేసులు వచ్చాయి. దీంతో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,588కు చేరింది.  వారిలో తాజాగా 42 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం డిశ్చార్జి సంఖ్య 2,641కి చేరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 1,865 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా ముగ్గురికి కరోనా సోకగా.. వారికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య 202కు చేరింది. అందులో తాజాగా ఒకరు డిశ్చార్జి కాగా.. 180 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 33 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1068కు చేరింది. వీరిలో 51 మంది తాజాగా డిశ్చార్జి అవ్వగా.. 564 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

Read This Story Also: ఈఎస్‌ఐ స్కాంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల పాత్ర.. తెలంగాణలోనూ..!