అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

|

Aug 21, 2019 | 5:45 PM

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కన్నవారికి తీరని విషాదం మిగిల్చాడు. విశాఖ సీతమ్మధారకు చెందిన 27ఏళ్ల సుమేద్ మానర్.. అమెరికాలోని ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చేస్తున్నాడు. ఐతే ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి క్రీటర్ లాక్ నది వద్దకు వెళ్లిన సుమేద్..25 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకాడు. స్విమ్మింగ్ కోసం సరస్సులోకి దూకిన సుమేద్ తిరిగిరాలేదు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. […]

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి
Follow us on

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కన్నవారికి తీరని విషాదం మిగిల్చాడు. విశాఖ సీతమ్మధారకు చెందిన 27ఏళ్ల సుమేద్ మానర్.. అమెరికాలోని ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చేస్తున్నాడు. ఐతే ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి క్రీటర్ లాక్ నది వద్దకు వెళ్లిన సుమేద్..25 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకాడు. స్విమ్మింగ్ కోసం సరస్సులోకి దూకిన సుమేద్ తిరిగిరాలేదు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

స్నేహితులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు..గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి 90 అడుగుల లోతులో బాడీని గుర్తించి వెలికితీశారు. సుమేద్ ఇక లేడన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సుమేద్ తండ్రి ఎంఎస్ కుమార్ స్టీల్ ప్లాంట్ క్రీడల శాఖ డీజీఎంగా పనిచేస్తున్నారు.