నడి వీధిలో దుర్మార్గం.. 15 ఏళ్ళ బాలికపై.. 20 మంది దాడి

| Edited By: Pardhasaradhi Peri

Mar 07, 2020 | 5:39 PM

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో ఇటీవల జరిగిందో అమానుషం. 15 ఏళ్ళ బాలికపై  దాదాపు 20 మంది దుండగులు దాడి చేసిఆమె సెల్ ఫోన్ ను, డెబిట్ కార్డును దోచుకుపోయారు.

నడి వీధిలో దుర్మార్గం.. 15 ఏళ్ళ బాలికపై.. 20 మంది దాడి
Follow us on

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో ఇటీవల జరిగిందో అమానుషం. 15 ఏళ్ళ బాలికపై  దాదాపు 20 మంది దుండగులు దాడి చేసిఆమె సెల్ ఫోన్ ను, డెబిట్ కార్డును దోచుకుపోయారు. వారి ఎటాక్ లో కింద పడిపోయిన ఆ నిస్సహాయురాలిపై  పిడిగుద్దులు కురిపిస్తూ.. కాళ్లతో తన్నుతూ బీభత్సం సృష్టించారు. ఆ మూకను ఎదుర్కొని ఆ బాలికను రక్షించే వారే లేకపోయారు. సుమారు కొన్ని నిముషాలపాటు జరిగిన ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ముఖం మీద, కాళ్ళ మీద తీవ్ర గాయాలైన ఆమెను ఆ తరువాత కొందరు ఆసుపత్రికి తరలించారు.  ఈ దాడికి కారణం తెలియలేదు. అయితే గతంలో జరిగిన ఏదో వివాదమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి ఆ దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. న్యూయార్క్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి  హింసాకాండ పెరిగిపోయిందని పోలీసులే అంగీకరిస్తున్నారు.