పాక్ మంత్రి నోటి దురుసు.. ఏమన్నాడంటే ?

|

Oct 30, 2019 | 11:58 AM

పాకిస్తాన్ మంత్రి ఒకరు తన నోటిదురుసుతనం బయటపెట్టి వివాదం సృష్టించాడు.కాశ్మీర్ అంశంపై ఏ దేశమైనా ఇండియాకు మద్దతునిచ్చిన పక్షంలో ఆ దేశంపై మిసైల్ తో దాడి చేస్తామని, పైగా ఆ దేశాన్ని తమ శత్రు దేశంగా భావిస్తామని అన్నాడు. కాశ్మీర్ సమస్య మీద భారత దేశంతో ఉద్రిక్తత తలెత్తితే.. మేం తప్పనిసరిగా యుధ్ధానికి దిగుతాం .. మా దేశాన్ని కాకుండా భారత్ ను సమర్థిస్తే.. మా శత్రువుగా పరిగణించి ఆ దేశంపై క్షిపణి ప్రయోగిస్తాం ‘ అని […]

పాక్ మంత్రి నోటి దురుసు.. ఏమన్నాడంటే ?
Follow us on

పాకిస్తాన్ మంత్రి ఒకరు తన నోటిదురుసుతనం బయటపెట్టి వివాదం సృష్టించాడు.కాశ్మీర్ అంశంపై ఏ దేశమైనా ఇండియాకు మద్దతునిచ్చిన పక్షంలో ఆ దేశంపై మిసైల్ తో దాడి చేస్తామని, పైగా ఆ దేశాన్ని తమ శత్రు దేశంగా భావిస్తామని అన్నాడు. కాశ్మీర్ సమస్య మీద భారత దేశంతో ఉద్రిక్తత తలెత్తితే.. మేం తప్పనిసరిగా యుధ్ధానికి దిగుతాం .. మా దేశాన్ని కాకుండా భారత్ ను సమర్థిస్తే.. మా శత్రువుగా పరిగణించి ఆ దేశంపై క్షిపణి ప్రయోగిస్తాం ‘ అని పాక్ ప్రభుత్వంలో కాశ్మీర్ వ్యవహారాలపై గల మంత్రి అలీ అమీన్ గండాపూర్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేసిన వీడియోలో ఈ మంత్రిగారి రెచ్ఛగొట్టుడు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత సెప్టెంబరులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. న్యూయార్క్ లోని ఐరాస సభలో ప్రసంగించినప్పుడు అదేపనిగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో అణు యుధ్ధం తప్పకపోవచ్ఛునని హెచ్ఛరించాడు. ఇది వార్నింగ్ కాదని, కానీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉండాలని కోరుతున్నానని ఇమ్రాన్ పేర్కొన్నాడు. కాశ్మీర్ తమ అంతర్గత సమస్య అని భారత్ ఎన్నోసార్లు స్పష్టం చేసినప్పటికీ.. పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ వేదికల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ‘ బొక్క బోర్లా పడుతోంది ‘.