జర్నలిస్టులపై మళ్లీ నోరు పారేసుకున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు

|

Aug 25, 2020 | 11:27 AM

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోకు జర్నలిస్టులంటే ఎందుకంత ఆక్రోషమో తెలియదు కానీ.. ఉత్తి పుణ్యానికే విలేకరులను తిట్టిపోస్తున్నారు.. మొన్నటికి మొన్న ఓ జర్నలిస్టును మూతి పగలకొడతానంటూ బెదిరించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు ఏకంగా జర్నలిస్టులందరినీ కలిపి తిట్టేశారు..

జర్నలిస్టులపై మళ్లీ నోరు పారేసుకున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు
Follow us on

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోకు జర్నలిస్టులంటే ఎందుకంత ఆక్రోషమో తెలియదు కానీ.. ఉత్తి పుణ్యానికే విలేకరులను తిట్టిపోస్తున్నారు.. మొన్నటికి మొన్న ఓ జర్నలిస్టును మూతి పగలకొడతానంటూ బెదిరించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు ఏకంగా జర్నలిస్టులందరినీ కలిపి తిట్టేశారు.. విలేకరులంతా వట్టి పిరికివారంటూ అనడమే కాకుండా, వారికి త్వరలో కరోనా వైరస్‌ అంటుకుంటుందని, ఆ వ్యాధితో మళ్లీ కోలుకోలేకుండా పోతారని శపించారు కూడా! కరోనా వైరస్‌తో సతమతమైన బోల్సొనారో దాన్నుంచి ఎలా బయటపడ్డారో చెప్పుకొచ్చారు. హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ఔషధాన్ని తీసుకోవడంతో పాటు తనలోని రోగనిరోధక శక్తి కారణంగానే తాను కరోనా నుంచి బయటపడగలిగానని అన్నారు. ఆ తర్వాత ఆయన నోరు ఎటోటో వెళ్లింది.. జర్నలిస్టులను ఉద్దేశిస్తూ నానా మాటలనేశారు. జర్నలిస్టులు చెడును మాత్రమే సృష్టిస్తారట.. అసలు వారి పెన్నులు మంచిని సహించవట.. ఇలా ఏమేమో అనేశారు.. ఇక నుంచి విలేకరులు జైర్‌ బోల్సొనారోకు ఆమడ దూరంలో ఉంటే మంచిదేమో!