Watch Video: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు..

|

Apr 22, 2024 | 1:35 PM

మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిరుమలలో సందడి చేశారు. తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి ఆలయ అలంకరణకు అవసరమైన విరాళాన్ని అందించారు. వీరికోసం టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. ఆలయ సిబ్బంది మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు దగ్గరుండి మరీ దర్శనం కల్పించారు.

మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిరుమలలో సందడి చేశారు. తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి ఆలయ అలంకరణకు అవసరమైన విరాళాన్ని అందించారు. వీరికోసం టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. ఆలయ సిబ్బంది మాజీ క్రికెటర్
లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు దగ్గరుండి మరీ దర్శనం కల్పించారు. స్వామి వారి నేవేద్య విరామం సమయంలో మలయప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం లక్ష్మణ్ దంపతులు, కుటుంబ సభ్యులకు వేద పండితులు శ్రీ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో స్వామి వారి శేష వస్త్రాన్ని కప్పి సత్కరించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆయన బయటకు రావడం గమనించిన అభిమానులు, భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on