కరోనా ఎఫెక్ట్: అయ్యప్ప భక్తులకు షాక్
అయ్యప్ప భక్తులకు కేరళ మంత్రి చేదువార్త వెల్లడించారు. భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని తెరవబోవడం లేదంటూ ఆ రాష్ట్ర మంత్రి కడకంపల్లి సురేంద్రన్ అన్నారు.
అయ్యప్ప భక్తులకు కేరళ మంత్రి చేదువార్త వెల్లడించారు. భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని తెరవబోవడం లేదంటూ ఆ రాష్ట్ర మంత్రి కడకంపల్లి సురేంద్రన్ అన్నారు. అలాగే నెలవారీ పూజ, పండుగను కూడా వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. శబరిమల తంత్రి, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేంద్రన్ తెలిపారు. అయితే ఆలయంలో సాధారణ పూజలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
కాగా లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి ప్రార్థనాస్థలాలు తెరుచుకోవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రార్థనాస్థలాలు తెరుచుకోగా.. ఈ నెల 14న సాయంత్రం నెలపూజ కోసం శబరిమలను తెరుస్తామని, 19న ఆలయ పండుగ ప్రారంభం అవుతుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు ఇటీవల వెల్లడించారు. భక్తులకు కూడా ప్రవేశం ఉంటుందని ఆయన అన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ శబరిమల తంత్రుల్లో ఒకరైన మహేష్ మోహనరాజు బోర్డుకు లేఖ రాశారు. దీంతో మరోసారి చర్చించిన శబరిమల తంత్రి, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తాజా నిర్ణయాన్ని వెల్లడించారు.
Read This Story Also: ఆ వ్యాపారవేత్త ఎవరో నాకూ చెప్పండి-హన్సిక