New coronavirus strain in India: దేశంలో మరో నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్..మొత్తం కేసుల సంఖ్య ఎంతంటే..?
కరోనా పీడ ఇంకా పోలేదు. ఇంకా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇంతలోనే స్ట్రెయిన్ వైరస్ కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు స్ట్రెయిన్ వైరస్ను ఎదురుకోడానికి ఎంతమేర దోహదపడుతాయి...
కరోనా పీడ ఇంకా పోలేదు. ఇంకా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇంతలోనే స్ట్రెయిన్ వైరస్ కలవరపెడుతోంది. ప్రస్తుతం కరోనా కోసం తయారు చేసిన వ్యాక్సిన్లు స్ట్రెయిన్ వైరస్ను ఎదురుకోడానికి ఎంతమేర దోహదపడుతాయి అన్న అంశంపై పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. కాగా దేశంలో స్ట్రెయిన్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. కొత్తగా మరో నాలుగు స్ట్రెయిన్ వైరస్ కేసులను అధికారులు నిర్ధారించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి పెరిగింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సమయంలో..ఈ కొత్త స్ట్రెయిన్ విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
దేశంలో మొత్తం 10 ల్యాబ్లకు గాను ఆరు ల్యాబ్లలో టెస్టుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కొత్తగా వెలుగు చూసిన ఈ నాలుగు కేసుల్లో మూడు బెంగళూరులో కాగా.. ఒకటి హైదరాబాద్లో వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎన్సీడీసీలో 8, ఐజీఐబీలో 2, కల్యాణీ(కోల్కతా) ఎన్ఐబీఎంజీలో 1, పుణె ఎన్ఐవీలో 5, హైదరాబాద్ సీసీఎంబీలో 3, బెంగళూరు నిమ్హాన్స్లో 10 నమూనాలు కొత్త వైరస్కు పాజిటివ్గా తేలినట్లు వైద్య శాఖ వివరించింది.
బ్రిటన్లో స్ట్రెయిన్ ప్రభలడంతో వెంటనే అలర్టైన ఇండియా.. ఆ దేశం నుంచి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య 33వేల మంది వచ్చినట్టు గుర్తించింది. వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. కొందరికి కరోనా పాజిటివ్గా అని నిర్ధారణ అయ్యింది. వీరిలో కొత్త రకం కరోనా (స్ట్రెయిన్) ఇప్పటివరకు 29 మంది ఉన్నట్టు తదుపరి పరీక్షల్లో తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read :
Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్