ప్రియుడితో కలిసి దారుణం చేసిన భార్య

|

Mar 17, 2019 | 10:31 AM

మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తనే హత్య చేసింది. భర్తను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో కొట్టి హతమార్చారు. ఈ హత్యకు ప్రధాన కారణం భర్త చనిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని భార్య భావించడమే. మహబూబ్ నగర్‌లోని మున్సిపల్ కార్యాలయంలో 35 ఏళ్ల నరసింహా స్వీపర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య లక్ష్మీదేవీకి గత కొంత కాలంగా శేఖర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. […]

ప్రియుడితో కలిసి దారుణం చేసిన భార్య
Follow us on

మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తనే హత్య చేసింది. భర్తను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో కొట్టి హతమార్చారు. ఈ హత్యకు ప్రధాన కారణం భర్త చనిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని భార్య భావించడమే.

మహబూబ్ నగర్‌లోని మున్సిపల్ కార్యాలయంలో 35 ఏళ్ల నరసింహా స్వీపర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య లక్ష్మీదేవీకి గత కొంత కాలంగా శేఖర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఏడాది క్రితమే భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అయితే పక్క పథకం వేసుకుని కొద్ది రోజుల క్రితమే తిరిగి భర్త వద్దకు వచ్చింది.

అతన్ని నమ్మించి జడ్చర్ల సమీపంలోని బురెడ్డిపల్లి శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి దాడి చేశారు. బీరు బాటిల్‌తో బలంగా తలపై కొట్టారు. దీంతో నరసింహ అక్కడికక్కడే కన్నుమూశాడు. కేసు విచారణలో భాగంగా పోలీసులకు నిజా నిజాలు బయటపడ్డాయి. దీంతో నిందుతలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.