“దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌’.. సమీపంలో ప్రమాదం !

|

Dec 10, 2019 | 6:10 PM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చటాన్‌పల్లి బైపాస్‌ వద్ద వేగంగా వస్తున్న టాటా ఏసీ వాహనం ఆగి ఉన్న లారీని ఢి కొట్టడంతో ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.  టాటా ఏసీ వెహికిల్ ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో  అద్దాలు పగిలి అందులో ఓ మహిళా ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటికి తీశారు. క్షతగాత్రులను హుటాహుటినా […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. సమీపంలో ప్రమాదం !
Follow us on
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చటాన్‌పల్లి బైపాస్‌ వద్ద వేగంగా వస్తున్న టాటా ఏసీ వాహనం ఆగి ఉన్న లారీని ఢి కొట్టడంతో ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.  టాటా ఏసీ వెహికిల్ ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో  అద్దాలు పగిలి అందులో ఓ మహిళా ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటికి తీశారు. క్షతగాత్రులను హుటాహుటినా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.