ఆర్టీసీ కార్మిక కుటుంబాలకు సర్కార్‌ చేయూత

| Edited By: Srinu

Dec 07, 2019 | 8:09 PM

సమ్మె కాలంలో మృతి చెందిన ఇద్దరు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. సత్తుపల్లి డిపోకు చెందిన ఖాజామియా (డ్రైవర్‌) కొడుకు ఫిర్దోజ్‌, నీరజ (కండక్టర్‌) భర్త రాజశేఖర్‌కు జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలుగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ కారుణ్య నియామకాల కింద సీఎం ఉద్యోగాలు […]

ఆర్టీసీ కార్మిక కుటుంబాలకు సర్కార్‌ చేయూత
Follow us on

సమ్మె కాలంలో మృతి చెందిన ఇద్దరు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. సత్తుపల్లి డిపోకు చెందిన ఖాజామియా (డ్రైవర్‌) కొడుకు ఫిర్దోజ్‌, నీరజ (కండక్టర్‌) భర్త రాజశేఖర్‌కు జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలుగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ కారుణ్య నియామకాల కింద సీఎం ఉద్యోగాలు ప్రకటించి వారం లోపల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు.