సరోగసి మాఫియా కలకలం

|

Aug 29, 2019 | 6:44 PM

సూర్యపేటలో సరోగసి మాఫియా కలకలం రేపింది. మహిళలను ట్రాప్‌ చేసి చెన్నై పంపిస్తున్నఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలనుతరలిస్తున్న వాణి, కుమారిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆగస్టు 5వ తేదీన శ్రీలత అనే వివాహిత అదృశ్యమైనట్లు ఆమె భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. శ్రీలత ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు డొంకలాగారు. శ్రీలతను చెన్నైకి పంపి సరోగసి మాఫియాకు ఈ ముఠా అప్పగించినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ […]

సరోగసి మాఫియా కలకలం
Follow us on
సూర్యపేటలో సరోగసి మాఫియా కలకలం రేపింది. మహిళలను ట్రాప్‌ చేసి చెన్నై పంపిస్తున్నఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలనుతరలిస్తున్న వాణి, కుమారిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆగస్టు 5వ తేదీన శ్రీలత అనే వివాహిత అదృశ్యమైనట్లు ఆమె భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. శ్రీలత ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు డొంకలాగారు. శ్రీలతను చెన్నైకి పంపి సరోగసి మాఫియాకు ఈ ముఠా అప్పగించినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు జిల్లా ఎస్సీ మీడియాకు వివరించారు. ఇటువంటి మాఫియా నుండి మహిళలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.