గంగపుత్ర సంఘం, రజక సమాజ్‌ సమస్య పరిష్కారం.. కార్వాన్‌లో శంకుస్థాపన చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ

|

Jan 21, 2021 | 10:46 AM

హైదరాబాద్‌ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కార్వాన్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు..

గంగపుత్ర సంఘం, రజక సమాజ్‌ సమస్య పరిష్కారం.. కార్వాన్‌లో శంకుస్థాపన చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ
Follow us on

హైదరాబాద్‌ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కార్వాన్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జియాగుడలోని గంగపుత్ర సంగం శ్మశానవాటిక అభివృద్ధి పనులకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి భూమిపూజ చేశారు.

గంగపుత్ర సంఘం, హిందీ రాజక సమాజ్ సభ్యులతో కలిసి స్మశాన వాటిక అభివృద్ధి పనులకు అసదుద్దీన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌసర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.

స్మశానవాటిక కాంపౌండ్ గోడ నిర్మాణ పనులు, ఫ్లోరింగ్ వేయడం, బోర్‌వెల్ డ్రిల్లింగ్ మంజూరు కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో పనులన్నీ పూర్తవుతాయని కౌసర్‌ మొహియుద్దీన్‌ అన్నారు.