ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..

|

Dec 16, 2019 | 7:19 PM

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బోధన్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఓ రైతు కుటుంబం పెట్రోల్ పొసుకుని ఆత్మహత్యకు యత్నించింది.. సకాలంలో అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది.. వివరాలలోకి వెళితే పంటకుర్డ్ గ్రామానికి చెందిన రైతు కుటుంబం పొలాన్ని కొందరు కబ్జా చేశారు. దీనిపై అధికారుల దృష్టికి తెచ్చిన ఎటువంటి స్పందన లేకపోయింది.. దీంతో ఆ కుటుంబానికి చెందిన మహిళతో సహా కుటుంబ పెద్ద ఆర్డీవో కార్యాలయానికి […]

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..
Follow us on
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బోధన్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఓ రైతు కుటుంబం పెట్రోల్ పొసుకుని ఆత్మహత్యకు యత్నించింది.. సకాలంలో అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది.. వివరాలలోకి వెళితే పంటకుర్డ్ గ్రామానికి చెందిన రైతు కుటుంబం పొలాన్ని కొందరు కబ్జా చేశారు. దీనిపై అధికారుల దృష్టికి తెచ్చిన ఎటువంటి స్పందన లేకపోయింది.. దీంతో ఆ కుటుంబానికి చెందిన మహిళతో సహా కుటుంబ పెద్ద ఆర్డీవో కార్యాలయానికి పెట్రోల్ సీసాలతో వచ్చారు.. తమ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో మహిళ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుంది.. గమనించిన కార్యాలయ సిబ్బంది  అప్రమత్తమై వెంటనే ఆమెను అడ్డుకున్నారు.. ఆ తర్వాత వారిని ఆర్డీవో గోపిరామ్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. కబ్జా సమాచారం తెలుసుకున్న ఆర్డీవో సంబంధిత సిబ్బందితో మాట్లాడి న్యాయం చేస్తానని ఆ రైతు కుటుంబానికి హామీ ఇచ్చారు.