మంత్రులతో కేసీఆర్‌ వ్యూహాత్మక చర్చలు

|

Sep 03, 2020 | 9:08 PM

మంత్రులు, విప్‌లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం తన మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపారు. సభలో విపక్షాలు కోరిన అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీని నిర్వహిద్దామని.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కారాదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు కేసీఆర్. జీఎస్టీ అమలులో రాష్ట్రానికి జరిగిన […]

మంత్రులతో కేసీఆర్‌ వ్యూహాత్మక చర్చలు
Follow us on

మంత్రులు, విప్‌లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం తన మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపారు. సభలో విపక్షాలు కోరిన అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీని నిర్వహిద్దామని.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కారాదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు కేసీఆర్. జీఎస్టీ అమలులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభలోనే చర్చించాలని.. ఈనెల 7న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు మంత్రులు, విప్‌లు పాల్గొన్నారు. ఇలా ఉండగా, రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్తచట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ గత వారమే సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.