Telangana: రచ్చకు దారి తీసిన మటన్‌ ముక్క.. గరిటెలు, కర్రలతో కొట్లాట..

|

Aug 29, 2024 | 9:31 AM

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. అయితే ఇదే సమయంలో వరుడి తరఫున వచ్చిన కొందరు యువకులకు మటన్‌ను వడ్డించారు దీంతో తమకు మటన్‌ ముక్కలు...

Telangana: రచ్చకు దారి తీసిన మటన్‌ ముక్క.. గరిటెలు, కర్రలతో కొట్లాట..
Mutton Curry
Follow us on

కొన్ని సందర్భాల్లో సిల్లీ కారణాలు కూడా పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. చాలా వరకు గొడవలు ఇగో కారణంగా జరుగుతుంటాయి. ఒక చిన్న మటన్‌ బొక్క కూడా గొడవకు దారి తీస్తుంది. బలగం సినిమాలో సన్నివేశం అందిరికీ గుర్తుండే ఉంటుంది. నల్లి బొక్క వేయలేదన్న కారణంతో రెండు కుటుంబాలు ఏళ్లపాటు దూరమవుతాయి. అయితే ఇది కేవలం సినిమాకే పరిమితం కాలేదు, నిజ జీవితంలో సైతం ఇలాంటి ఓ సంఘటన జరిగింది. మటన్‌ కూర ఇరు కుటుంబాల మధ్య దాడులు చేసుకునే పరిస్థితికి దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. అయితే ఇదే సమయంలో వరుడి తరఫున వచ్చిన కొందరు యువకులకు మటన్‌ను వడ్డించారు దీంతో తమకు మటన్‌ ముక్కలు సరిగ్గా వేయలేదంటూ యువకులు ఆరోపించారు. ఇది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారి తీస్తుంది.

వెంటనే వధువు తరఫు బంధువులు సైతం రంగంలోకి దిగారు. దీంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాక పరిస్థితి చేరింది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..