కోతిమూకలను బెదరగొట్టిన ఎలుగు మనిషి !

|

Dec 12, 2019 | 7:15 PM

అడవులు వదిలి మైదానం బాటపట్టిన కోతులు..జనావాసాల్లో చేరి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మందలకు మందలుగా చేరిన కోతులు..పల్లెపట్నం తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతిచేష్టలతో రైతులు, సామాన్య ప్రజలు, ప్రభుత్వాలను సైతం కోటి కష్టాలకు గురిచేస్తున్నాయి. అనేక జిల్లాలో ఇళ్లు, పంట పొలాలపై పండి విధ్వంసం చేస్తున్నాయి. కోతుల దాడుల్లో గాయాల పాలైన వారు ఊరూరా పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఊర్ల మీద పడుతున్న కోతులను ఇదివరకటిలా కొండముచ్చులను తెచ్చి బెదిరించినా ఫలితం లేకుండా పోతోంది.. […]

కోతిమూకలను బెదరగొట్టిన ఎలుగు మనిషి !
Follow us on
అడవులు వదిలి మైదానం బాటపట్టిన కోతులు..జనావాసాల్లో చేరి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మందలకు మందలుగా చేరిన కోతులు..పల్లెపట్నం తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతిచేష్టలతో రైతులు, సామాన్య ప్రజలు, ప్రభుత్వాలను సైతం కోటి కష్టాలకు గురిచేస్తున్నాయి. అనేక జిల్లాలో ఇళ్లు, పంట పొలాలపై పండి విధ్వంసం చేస్తున్నాయి.
కోతుల దాడుల్లో గాయాల పాలైన వారు ఊరూరా పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఊర్ల మీద పడుతున్న కోతులను ఇదివరకటిలా కొండముచ్చులను తెచ్చి బెదిరించినా ఫలితం లేకుండా పోతోంది.. వానరాలను భయపెట్టేందుకు కొందరు రైతులు తమ పొలాల్లో పులిబొమ్మలు ఏర్పాటు చేశారు. కొందరు డప్పులు వాయిస్తూ శబ్ధాలు చేస్తూ తరిమికొట్టేప్రయత్నం చేశారు. కుక్కలతో దాడి చేయిస్తారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కోతిమూకను తరిమికొట్టే ఉపాయాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ రైతు సరికొత్త పథకం వేశాడు. కొండముచ్చులకు కూడా బెదరని కోతుల తిక్క కుదర్చటానికి వెరైటీగా ఓ వ్యక్తిని ప్రత్యకించి ఏర్పాటు చేశాడు. అతనికి ఎలుగుబంటి వేశం కట్టించి ఊరంతా తిప్పుతున్నాడు. ఎలుగుబంటి ఆకారంలో ఉన్న ఆ విచిత్ర జంతువును చూసిన కోతులు కూడా భయంతో తోకముడుచుకుని పారిపోతున్నాయి.