ఆన్ లైన్ మోసాలు శృతి మించుతున్నాయి. మీకు లాటరీ తగిలింది.. లక్ష మందిలో మీకే అదృష్టం వరంచింది.. మీ పాన్ నంబర్ అప్ డేట్ కాలేదు.. వంటి మెసేజ్ లతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించడం ఇప్పటి వరకూ మనం చూస్తూ వస్తున్నాం. వాటిని నమ్మి ఆ మెసేజ్ లో ఇస్తున్న లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగాలనే వినియోగదారుల ఖాతాలోని డబ్బులు కాజేస్తున్నారు దుండగులు. ఇప్పుడు మరో మార్గంలో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అదేంటంటే కరెంటు బిల్లుకు సంబంధించిన మోసం. కరెంటు బిల్లులతో మోసం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి.. మోసగాళ్లు నకిలీ సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఇవి విద్యుత్ శాఖ నుంచి అధికారిక వచ్చిన సందేశాలుగా చాలా మంది పొరబడి మోసపోతున్నారు. మీ గత నెల కరెంటు బిల్లు ఇంకా అప్డేట్ కాలేదని, అందుకే ఈ రాత్రికి కనెక్షన్ను డిస్కనెక్ట్ చేస్తామని మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి. దీంతో అయోమయంలో పడిన వారు బిల్లు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో చోరుల పని తేలిక అవుతోంది. ఇదెలా చేస్తున్నారు? ఈ మోసం బయటపడాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
‘ప్రియమైన కస్టమర్, ఈ రోజు రాత్రి 9.30 గంటలకు విద్యుత్ కార్యాలయం నుంచి మీ విద్యుత్తు డిస్కనెక్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మీ గత నెల బిల్లు అప్డేట్ కాలేదు. దయచేసి వెంటనే మా విద్యుత్ అధికారి 92609XXX52ను సంప్రదించండి. ధన్యవాదాలు‘. మీకు ఇలాంటి ఎస్ఎంఎస్ వచ్చిందా? లేదా వాట్సాప్ లో అయిన మెసేజ్ వచ్చిందా? మీ సమధానం అవును అయితే, జాగ్రత్తగా ఉండండి. ఆ మెసేజ్ లో ఇచ్చిన నంబర్కు కాల్ చేయవద్దు. అలాగే ఆ మెసేజ్ లతో పాటు ఏదైనా లింక్ ఇస్తే వాటిపై అస్సలు క్లిక్ చేయండి. ఫిషింగ్ లింక్లను కలిగి ఉన్న కొత్త తరహా స్కామ్ వంటి సందేశాలను దేశవ్యాప్తంగా చాలా మంది మొబైల్ వినియోగదారులు స్వీకరిస్తున్నారు. చిన్న పొరపాటు మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.
విద్యుత్ బిల్లు స్కామ్ అనేది మోసగాళ్ల కొత్త స్కామ్ పద్ధతి. ఈ రకమైన ఆన్లైన్ స్కామ్లో, మోసగాళ్లు అధికారిక విద్యుత్ శాఖ నుంచి పంపినట్లుగా నకిలీ సందేశాలను పంపుతారు. ఈ మెసేజ్లలో కరెంటు బిల్లు కట్టనందుకు తక్షణమే కరెంటు కట్ చేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారు. దీంతో భయాందోళనలకు గురవుతున్న వినియోగదారులు, ఏమాత్రం సంకోచం లేకుండా తొందరపాటు చెల్లింపులుచేస్తున్నారు.
దుండగులు పంపే మెసేజ్ నిజమైన మెసేజ్ల వలె కనిపించేలా.. చట్టబద్ధంగా కనిపించేలా తెలివిగా రూపొందించబడతాయి. స్కామర్లు అధికారిక లోగోలు, భాషను ఉపయోగిస్తున్నారు. అలాగే వారు గ్రహీత పేరు, ఖాతా నంబర్ను కూడా కలిగి ఉండవచ్చు. ఇది నిజమైన, మోసపూరిత సందేశాల మధ్య తేడాను గుర్తించడం కష్టతరం చేస్తుంది. ఈ మోసానికి చాలా మంది బాధితులుగా మారారు. దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని వ్యక్తుల బ్యాంకు ఖాతాలను స్కామర్లు హరించివేశారు. నివేదిక ప్రకారం, ఒక సందర్భంలో బాధితుడు తనకు విద్యుత్ శాఖ అధికారి అని చెప్పుకునే వ్యక్తి నుండి కాల్ వచ్చిందని చెప్పారు. తమ కరెంటు బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ను నిలిపివేస్తామని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు.
బిల్లును ఎలా చెల్లించాలని బాధితుడు అడిగినప్పుడు, కాల్ చేసిన వ్యక్తి టీం వ్యూయర్ క్విక్ సపోర్టు(TeamViewer Quick Support) మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ను పంపాడు. బాధితుడు యాప్ను డౌన్లోడ్ చేసిన వెంటనే, స్కామర్లు అతని బ్యాంకు ఖాతాకు యాక్సెస్ను పొందారు. అతని ఖాతా నుంచి మొత్తం రూ. 4.9 లక్షలు విత్డ్రా కాజేశారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..