ఏపీ ప్రయాణాలపై ఆంక్షలు.. రాత్రి 7 గంటల వరకు అనుమతి..!
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. ఏపీ ప్రయాణాలపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. ఏపీ ప్రయాణాలపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ మీదుగా ఏపీకి వెళ్లాలనుకునే వారు ఇకపై రాత్రి 7 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం దాటిపోవాలని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే సరిహద్దుల్లో వాహనాలను అనుమతించడం జరుగుతుందని రంగనాధ్ స్పష్టం చేశారు.
ఇక నాగార్జున సాగర్- మాచర్ల రోడ్డును ఏపీ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రహదారిగా గుర్తించడంతో ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణాకు ఏపీ పోలీసులు అనుమతించడం లేదన్న విషయాన్ని ప్రయాణీకులు గమనించాలన్నారు. అటు సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారికి పాసులు ఉండాలని, కరోనా పరీక్షలు కూడా నిర్వహిస్తామని అన్నారు. పాస్ లేకపోతే మాత్రం అనుమతించమన్నారు. అందువల్ల ఏపీకి వెళ్లాలనుకునేవారు సంబంధిత అధికారుల నుంచి పాసులు తీసుకుని ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు.
ఇది చదవండి: ఇంట్లోనే స్వీయ నిర్బంధం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఉంటేనే సేఫ్..