Pulse Polio: ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా పల్స్ పోలియో కార్యక్రమం.. రాష్ట్రంలో ఎంతమంది చిన్నారులున్నారంటే..
Pulse Polio: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోంది. 5 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు ఇవాళ దేశ..
Pulse Polio: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోంది. 5 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు ఇవాళ దేశ వ్యాప్తంగా పోలియో చుక్కలు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోలీయో చుక్కల కార్యక్రమాన్కని ఏపీలోనూ నిర్వహించారు. ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కులు వేయించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు ప్రచారం కూడా కల్పించారు. పోలియో చుక్కలు వేయడం కోసం ఇవాళ రాష్ట్రంలో 37,493 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1, 2వ తేదీలలో ఇంటింటికి వెళ్లి పోలీయో టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3న పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో టీకా వేస్తారు. ఇదిలాఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 52,72, 354 మంది ఉండగా, వారికి వ్యాక్సినే వేసేందుకు 1,49,977 మంది వ్యాక్సినేటర్లను నియమించారు. ఇక డోర్ టు డోర్ తిరిగే టీమ్స్ సంఖ్య 74,987 మంది ఉన్నారు రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగేందుకు 1,354 మంది మొబైల్ టీమ్స్ను నియమించారు. ఇక మొత్తం 66,95,000 పోలియో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వైద్య అధికారులు వెల్లడించారు.
Also read:
Rashmika Mandanna: తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చేసుకున్న రష్మిక మందన్న.. ఇంతకీ ఏంటో మీరే చదవండి
చైనాలోని సీ ఫుడ్ మార్కెట్ ని విజిట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం, అంతా గప్ చుప్