ఏపీ ఎన్నికల్లో పోలింగ్ రోజున వైసీపీ చేసే ఆగడాలను చంద్రబాబు ముందుగానే హెచ్చరించారని టీడీపీ సీనియర్ నేత జయరామిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్నంత హింస గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. ఈవీఎంల మొరాయింపుతో మహిళలు ఎండల్లో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.