Bandi Sanjay: కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసిన బండి సంజయ్

| Edited By: TV9 Telugu

Nov 07, 2023 | 5:03 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు. కాగా ఆగస్టు 4 తేదీన శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో బండి సంజయ్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు టాప్ లీడర్స్ హాజరవ్వనున్నారు.

1 / 5
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు.

2 / 5
జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయ్యారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ పార్టీకి చేసిన సేవలను మోదీ కొనియాడారు. అనతికాలంలోనే పార్టీకి జోష్ తెచ్చారని ప్రశంసించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయ్యారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ పార్టీకి చేసిన సేవలను మోదీ కొనియాడారు. అనతికాలంలోనే పార్టీకి జోష్ తెచ్చారని ప్రశంసించారు.

3 / 5
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. అందర్ని కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. అందర్ని కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు

4 / 5
 ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ తనయులతో మోదీ చాలా సేపు మాట్లాడి వాళ్లు ఏం చదవుతున్నారు వంటి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ తనయులతో మోదీ చాలా సేపు మాట్లాడి వాళ్లు ఏం చదవుతున్నారు వంటి వివరాలు తెలుసుకున్నారు.

5 / 5
ఆగస్టు 4 ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీసులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం భాగ్యనగరానికి వస్తారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు పార్టీ లీడర్స్, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.

ఆగస్టు 4 ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీసులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం భాగ్యనగరానికి వస్తారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు పార్టీ లీడర్స్, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.