Varavara Rao Hospital: విరసం నేత, కవి వరవరరావు జనవరి 13వ తేదీ వరకు ఆస్పత్రిలోనే చికిత్స పొందవచ్చని ముంబై హైకోర్టు తెలిపింది. కాగా, 81 ఏళ్లు ఉన్న వరవరరావుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనను కేంద్ర దర్యాప్తు బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత నవంబర్ లో అనారోగ్యం కారణంగా నానావతి ఆస్పత్రిలో చేర్చారు. వరవరరావు భార్య హేమలత బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ ను జనవరి 19న విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోగ్యంపై తాజాగా నివేదికను కోర్టుకు సమర్పించింది. దీంతో ఆయన 13 వరకు ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని జస్టిస్ ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్నిక్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
Fake Bills Scam: నకిలీ బిల్లులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు