యూపీలో 82 ఏళ్ళ వృద్దురాలు కోవిడ్ ని సునాయాసంగా ఎలా జయించిందంటే ?

| Edited By: Anil kumar poka

Apr 29, 2021 | 12:52 PM

అందరూ ఇలా చేస్తే కోవిడ్ పారిపోకుండా ఉంటుందా ? ఉదాహరణకు యూపీ లోని గోరఖ్ పూర్ లో 82  ఏళ్ళ వృద్దురాలు కోవిడ్ ని సునాయాసంగా జయించింది. హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ తన ఆక్సిజన్...

యూపీలో 82 ఏళ్ళ వృద్దురాలు కోవిడ్ ని సునాయాసంగా ఎలా జయించిందంటే ?
Up 82 Year Old Woman In Gorakhpur Fight Covid With Proning Technique
Follow us on

అందరూ ఇలా చేస్తే కోవిడ్ పారిపోకుండా ఉంటుందా ? ఉదాహరణకు యూపీ లోని గోరఖ్ పూర్ లో 82  ఏళ్ళ వృద్దురాలు కోవిడ్ ని సునాయాసంగా జయించింది. హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ తన ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుకోగల్గింది. తన కుమారుడు శ్యామ్ శ్రీవాత్సవ సహకారం తోను,  డాక్టర్ల సలహాతోను ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలు అయింది. కేవలం 12 రోజుల్లో స్వస్థత పొందింది. బీపీ, డయాబెటిస్ కూడా ఉన్న తన తల్లికి కరోనా పాజిటివ్ సోకిందని, కానీ ఆసుపత్రికి వెళ్లకుండానే ఇంట్లోనే ఆమెకు చికిత్స వంటిది చేశామని శ్యామ్ శ్రీకాత్సవ తెలిపారు. ముఖ్యంగా బోర్లా పడుకోవడం ద్వారా ఆమె ఆక్సిజన్ స్థాయిని పెంచుకోగలిగిందన్నారు. ఇలా 4 రోజులు చేస్తూ వచ్చిందని, ఎప్పటికప్పుడు తాను  ఆమె ఆక్సిజన్ స్థాయిని మానిటర్ చేస్తూ వచ్చానని ఆయన చెప్పారు.  తమ కుటుంబ సభ్యుల్లో ఇద్దరికీ తప్ప మిగతావారికి కరోనా పాజిటివ్ సోకిందని, కానీ అందరం దాని నుంచి బయటపడ్డామని అన్నారు. ఆయుర్వేద చికిత్స కూడా పొందామని, అన్నారు. తన తల్లికి రోజూ లవంగాలు, మిరియాల రసం ఇచ్చి దాని వాసన పీల్చాలని కోరామన్నారు. లోగడ 79 కి పడిపోయిన ఆమె ఆక్సిజన్ లెవెల్ ఇప్పుడు 97 కి చేరుకుందన్నారు.

మొత్తానికి ఆమె ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనట్టు ఆయన తెలిపారు. ఇలా ఉండగా.. బోర్లా పడుకుని శ్వాస పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుందట. మెడ , కడుపు, కాళ్ళ కింద ఒక్కో తలగడను పెట్టుకుని శ్వాస పీలిస్తే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుందని అంటున్నారు.  ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే మంచిదని చెబుతున్నారు.