కంగనా రనౌత్ పై తొలిసారి ఉధ్ధవ్ థాక్రే సెటైర్

| Edited By: Anil kumar poka

Sep 07, 2020 | 8:19 PM

ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే మొదటిసారిగా స్పందించారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన..

కంగనా రనౌత్ పై తొలిసారి ఉధ్ధవ్ థాక్రే సెటైర్
Follow us on

ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే మొదటిసారిగా స్పందించారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. కొంతమందికి తమకు జీవితాన్ని, మనుగడను ఇచ్చిన సిటీ పట్ల ఏ మాత్రం కృతజ్ఞత గానీ అభిమానం గానీ ఉండవన్నారు. అనిల్ రాథోడ్ అనే నేత ఎక్కడో రాజస్థాన్ నుంచి వఛ్చి ఈ మహారాష్ట్రను తన సొంత రాష్ట్రంగా చేసుకున్నారని, ఉత్తమ శివ సైనికుడయ్యారని ఆయన పేర్కొన్నారు. అయితే కంగనా పేరు పెట్టి ప్రస్తావించకుండా ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు.

ఇలా ఉండగా ఈ నెల 9 న తాను ముంబైలో అడుగుపెడతానని ప్రకటించిన కంగనా రనౌత్ మళ్ళీ తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ముంబైలో తన మణికర్ణికా ఫిలిమ్స్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ ఆమె దుయ్యబట్టిన సంగతి విదితమే.