కాశ్మీర్లో ముగ్గురు మిలిటెంట్ల హతం.. స్థానికులను వీడని భయం

| Edited By: Anil kumar poka

Feb 19, 2020 | 1:23 PM

జమ్మూ కాశ్మీర్.. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్ల మృతి, ట్రాల్ లో జరిగిన ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ నేత హమద్ ఖాన్ సహచరుడు జహంగీర్ రఫిఖ్ వని కూడా హతమయ్యాడు.

కాశ్మీర్లో ముగ్గురు మిలిటెంట్ల హతం.. స్థానికులను వీడని భయం
Follow us on

జమ్మూ  కాశ్మీర్లో ముగ్గురు మిలిటెంట్లను భద్రతా దళాలు కాల్చి చంపాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హమద్ ఖాన్ సన్నిహితుడైన జహంగీర్ రఫీఖ్ వని కూడా హతమయ్యాడు. పుల్వామా.. ట్రాల్ ప్రాంత పరిధిలోని డైవర్ గ్రామంలో అనుమానాస్పదంగా కనబడిన ముగ్గురిలో రఫీఖ్ కూడా ఒకడు. ఇతనితో బాటు భద్రతాదళాల కాల్పుల్లో రజా ఉమర్ మక్బుల్ భట్, ఉజైర్ అహ్మద్ భట్ కూడా మృతి చెందారు. ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హమద్ ఖాన్ గత జనవరిలో జవాన్ల చేతిలో మరణించాడు. అతనికి కుడి భుజంగా ఉంటూ వఛ్చిన జహంగీర్ కూడా మృతి చెందినప్పటికీ.. ట్రాల్ వాసులను ఇంకా భయం వెన్నాడుతోంది.  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వరలో ఇండియాకు రానున్న నేపథ్యంలో.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్ఛరిస్తూ.. పాక్ లోని ఉగ్రవాద సంస్థ.. జైషే మహ్మద్ ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పైగా నియంత్రణ రేఖ వద్ద పాక్ టెర్రరిస్టులు పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పేర్కొన్నాయి. .