రావాల్సింది వెయ్యి మంది.. వచ్చింది మాత్రం వేలాదిమంది..!

| Edited By:

May 19, 2020 | 5:47 PM

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది కార్మికులు వారి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. కాగా తాజాగా అధికారులు బాంద్రా నుంచి బీహార్‌ వరకు శ్రామిక్‌ స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే ఈ రైలులో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కానీ బాంద్రా టర్మినస్‌కు మాత్రం చాలా […]

రావాల్సింది వెయ్యి మంది.. వచ్చింది మాత్రం వేలాదిమంది..!
Follow us on

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది కార్మికులు వారి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. కాగా తాజాగా అధికారులు బాంద్రా నుంచి బీహార్‌ వరకు శ్రామిక్‌ స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే ఈ రైలులో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కానీ బాంద్రా టర్మినస్‌కు మాత్రం చాలా సంఖ్యలో వలస కార్మికులు వెళ్లారు. కేవలం 1000 మందికి మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా.. వేలాది సంఖ్యలో కార్మికులు వచ్చే సరికి పరిస్థితి అదుపు తప్పింది. దీంతో కార్మికులను బయటకు పంపించేందుకు అక్కడ పోలీసులు రంగంలోకి దిగి.. లాఠీఛార్జ్‌ చేశారు. దీనిపై పశ్చిమ రైల్వే సీపీఆర్వో రవిందర్ భకర్ మాట్లాడుతూ.. వేల సంఖ్యలో కార్మికులతో బాంద్రా రైల్వే స్టేషన్‌ కిక్కిరిసిపోయిందని అన్నారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ఆగిపోనున్న సూపర్‌స్టార్ సినిమా.. దర్శకుడు ఏమన్నారంటే..!