యూపీలో దారుణం, 13 ఏళ్ళ బాలికపై హత్యాచారం

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2020 | 10:35 AM

యూపీలోని లఖిమ్ పూర్ ఖేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిపి హతమార్చారు.  ఈ ఘటనలో ఇద్దరు రేపిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. చెరకు తోటల్లో..

యూపీలో దారుణం, 13 ఏళ్ళ బాలికపై హత్యాచారం
Follow us on

యూపీలోని లఖిమ్ పూర్ ఖేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిపి హతమార్చారు.  ఈ ఘటనలో ఇద్దరు రేపిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. చెరకు తోటల్లో ఈ బాలిక మృతదేహాన్ని వారు కనుగొన్నారు. తమ కూతురు కళ్ళు పీకారని, నాలుకను కోసివేశారని ఆ బాలిక తలిదండ్రులు చెబుతున్నప్పటికీ పోలీసులు దీన్ని ఖండించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో అలాంటిదేమీ జరగలేదని తేలిందని వారన్నారు. ఆమె కళ్ల వద్ద గాట్లు ఉన్నాయని,  పదునైన చెరకు ఆకులు తగిలి ఆ గాట్లు ఏర్పడి ఉండవచ్చునని అన్నారు.వివిధ చట్టాల కింద ఈ కిరాతకులు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గత శుక్రవారం నుంచి ఈ బాలిక కనిపించకుండా పోయింది.