లష్కరే తోయిబాకు భారీ షాక్.. ఉగ్రస్థావరంపై దాడి

| Edited By:

May 16, 2020 | 12:08 PM

కరోనా వేళ.. దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. గత ఏప్రిల్ నెలలో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. అంతేకాదు గత వారం హిజ్బుల్ టాప్ కమాండర్‌ను కూడా హతమార్చారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో.. ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమంలో భారత ఆర్మీ నిమగ్నమయ్యింది. తాజాగా.. జమ్మూకశ్మీర్ లోని బడ్గాం జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. శనివారం ఉదయం […]

లష్కరే తోయిబాకు భారీ షాక్.. ఉగ్రస్థావరంపై దాడి
Follow us on

కరోనా వేళ.. దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రయత్నాలను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. గత ఏప్రిల్ నెలలో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. అంతేకాదు గత వారం హిజ్బుల్ టాప్ కమాండర్‌ను కూడా హతమార్చారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో.. ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమంలో భారత ఆర్మీ నిమగ్నమయ్యింది.

తాజాగా.. జమ్మూకశ్మీర్ లోని బడ్గాం జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. శనివారం ఉదయం ఉగ్రస్థావరంపై దాడి చేసి.. అందులో ఉన్న ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. బాధానే ప్రాంతంలోని అరిజల్ ఖాన్సాయిబ్‌లో నక్కిఉన్న లష్కర్-ఎ-తోయిబా టాప్ టెర్రరిస్ట్ “జహూర్ వాని”ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు రహస్యంగా ఉగ్ర స్థావరాన్ని నిర్వహిస్తున్నాడు. భద్రతా బలగాలు దాడి చేసిన సమయంలో.. స్థావరంలో పెద్ద ఎత్తున మారణాయుధాలు, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇతడు ఇతర ఉగ్రవాదులకు వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు.. వారికి మందు గుండు సామాగ్రిని కూడా సప్లై చేస్తాడని విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. లోయలో ఇతడితో పాటు మరో నలుగురు ఉగ్రవాదులు కూడా యాక్టివ్‌గా ఉన్నారని.. వారిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, రెండు రోజుల క్రితమే సైన్యం.. టాప్ 10 ఉగ్రవాదుల లిస్ట్ ప్రిపేర్ చేసింది. అందులో ఉన్న వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే మరో ఐదుగురు ఉగ్రవాదులు పట్టుబడటంతో.. ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలినట్టైంది.