‘దయ చేసి ఆమెపై రూమర్స్ ఆపేయండి’.. దిశా కుటుంబం

| Edited By: Jyothi Gadda

Jul 06, 2020 | 7:07 PM

బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్యపై రకరకాల వార్తలు, ఫేక్ వార్తలను నిలిపివేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె గత జూన్ 8 న ముంబైలోని..

దయ చేసి ఆమెపై రూమర్స్ ఆపేయండి.. దిశా కుటుంబం
Follow us on

బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్యపై రకరకాల వార్తలు, ఫేక్ వార్తలను నిలిపివేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె గత జూన్ 8 న ముంబైలోని తన అపార్ట్ మెంట్ 14 వ అంతస్థు నుంచి కిందికి దూకి సూసైడ్ కి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన అనంతరం సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో ఎన్నో అనవసరమైన వదంతులు, కుట్ర థియరీలు, ఊహాగానాలు వస్తున్నాయని, వాటిని నిలిపివేయాలని ఆ కుటుంబం ఓ ప్రకటనలో కోరింది. అసలే తమకుటుంబ సభ్యురాలి మృతితో ఎంతో ఆవేదనలో ఉన్న తాము వీటిని చూసి మరింత బాధ పడుతున్నామని వారు అన్నారు. దిశా మరణం తమకు అమిత దుఃఖాన్ని మిగిల్చిందని, ఇప్పుడిప్పుడే ఆ భారం నుంచి తేరుకుంటున్న తమను ఇవి ఇంకా క్షోభకు గురి చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా దిశా పేరెంట్స్ చాలా ఆవేదన చెందుతున్నారని, అందువల్ల దయచేసి ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని తమ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు.