సారీ ! అలా అన్నందుకు విచారిస్తున్నా ! మధ్యప్రదేశ్ హోం మంత్రి

| Edited By: Anil kumar poka

Sep 24, 2020 | 10:10 AM

ఈ కరోనా సమయంలో ముఖానికి మాస్క్ అవసరం లేదంటూ తాను చేసిన వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా క్షమాపణ చెప్పారు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..

సారీ ! అలా అన్నందుకు విచారిస్తున్నా ! మధ్యప్రదేశ్ హోం మంత్రి
Follow us on

ఈ కరోనా సమయంలో ముఖానికి మాస్క్ అవసరం లేదంటూ తాను చేసిన వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా క్షమాపణ చెప్పారు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు అసలు మాస్క్ అవసరమంటారా అని ఎదురు ప్రశ్న వేశారు. మాస్క్ లో ఏముంది అని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ మంత్రిగారి  వ్యాఖ్య పెద్ద రచ్ఛకు దారి తీసింది. సాక్షాత్తూ హోమ్ మంత్రే ఇలా అంటారా అని అంతా నోళ్లు వెళ్లబెట్టారు. ఇది సంచలనంగా కూడా మారేసరికి నరోత్తమ్ గారు తన కామెంట్ ను సవరించుకున్నారు. మాస్క్ అవసరం లేదన్న తన వ్యాఖ్యకు చింతిస్తున్నానని, ఈ తరుణంలో ప్రతివారూ అది ధరించాల్సిందేనని తాజాగా గురువారం పేర్కొన్నారు. తన ఉద్దేశాన్ని మీడియా వక్రీకరించిందన్న తరహాలో మాట్లాడారు. ఏమైనా అలా అన్నందుకు క్షమాపణ చెబుతున్నా అన్నారు. దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల మాదిరిగానే మధ్యప్రదేశ్ లో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.