సుశాంత్ కేసులో మీడియా ‘అతి’పై సుప్రీంకోర్టుకెక్కిన రియా చక్రవర్తి

| Edited By: Pardhasaradhi Peri

Aug 10, 2020 | 4:39 PM

సుశాంత్ కేసులో మీడియా తన పరిధికి మించి 'అతి'గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సుప్రీంకోర్టుకెక్కింది. ఈ కేసులో..

సుశాంత్ కేసులో మీడియా అతిపై సుప్రీంకోర్టుకెక్కిన రియా చక్రవర్తి
Follow us on

సుశాంత్ కేసులో మీడియా తన పరిధికి మించి ‘అతి’గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సుప్రీంకోర్టుకెక్కింది. ఈ కేసులో ఆమె దాఖలు చేసిన రెండో పిటిషన్ ఇది.. మీడియా తనను దోషిగా చూపడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఫిర్యాదు చేసింది. సుశాంత్ కేసును పాట్నా నుంచి ముంబైకోర్టుకు  బదిలీ చేయాలంటూ రియా ఇదివరకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి మృతికి రియా చక్రవర్తే కారణమని, ఆత్మహత్య చేసుకునేలా అతడిని ప్రేరేపించిందని సుశాంత్ తండ్రి కేకే ఖాన్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో వారు ఆమెపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.

అటు-ఈ కేసులో సత్యమే జయిస్తుందని, తనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని పేర్కొన్న రియా.., ఎలక్ట్రానిక్ మీడియాలో  తనపై ఎన్నో  దారుణ కథనాలు  వస్తున్నాయని కన్నీటి పర్యంతమవుతూ  ఇటీవల వీడియోను విడుదల చేసింది.