ఎన్నార్సీ లిస్ట్.. యుఎస్ కమిటీ ఆందోళన.. ఇదెక్కడి జోక్యం ?

|

Nov 20, 2019 | 8:38 PM

భారత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. అయితే ఏ మతానికి చెందినవారయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అస్సాంలో మళ్ళీ ఈ ప్రక్రియ చేపడతామని కూడా ఆయన చెప్పారు. కానీ ఇండియాలో ప్రధాని మోదీ ప్రభుత్వం చేబడుతున్న ప్రధాన నిర్ణయాలపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా.. అస్సాంలో గతంలో చేపట్టిన ఎన్నార్సీ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఈ […]

ఎన్నార్సీ లిస్ట్.. యుఎస్ కమిటీ ఆందోళన.. ఇదెక్కడి జోక్యం ?
Follow us on

భారత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని హోం మంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. అయితే ఏ మతానికి చెందినవారయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అస్సాంలో మళ్ళీ ఈ ప్రక్రియ చేపడతామని కూడా ఆయన చెప్పారు. కానీ ఇండియాలో ప్రధాని మోదీ ప్రభుత్వం చేబడుతున్న ప్రధాన నిర్ణయాలపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా.. అస్సాంలో గతంలో చేపట్టిన ఎన్నార్సీ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఈ ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్(యుఎస్ సీఐఆర్ఎఫ్) అనే పానెల్ దుయ్యబట్టింది. ఎన్నార్సీ పేరిట దాదాపు 20 లక్షల మంది అస్సాంవాసులు ఆ రాష్ట్రానికి చెందినవారు కాకపోతారని, సరైన, పారదర్శకమైన ప్రాసెస్ లేకుండా వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారని ఆరోపించింది. (అసలైన… జెన్యూన్ భారతీయ పౌరుల పేర్లతో కూడిన రిజిస్టర్ ను రూపొందించే ప్రక్రియే ఎన్నార్సీ.. అస్సాంలో 2013 లో సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఈ ప్రక్రియకు సంబంధించి రిజిస్టర్ ను అప్ డేట్ చేశారు. ఆ రాష్ట్రంలోని సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రజలు తాము 1971 మార్చి 24 వ తేదీకి ముందే భారత్ వఛ్చి ఇక్కడి పౌరులమయ్యామని నిరూపించుకోవాల్సి ఉంటుంది.) గత ఆగస్టు 31 న అప్ డేట్ చేసిన ఫైనల్ ఎన్నార్సీని ప్రభుత్వం రిలీజ్ చేసిన సంగతి విదితమే.. అయితే ఆ జాబితాలో సుమారు 19 లక్షలమంది పేర్లను తొలగించారు. తాము భారతీయులమేనని వారు నిరూపించుకోలేకపోయారు. దీనిపై దృష్టి పెట్టిన అమెరికన్ పానెల్.. ముస్లిములు ఓటు వేసేందుకు అనర్హులుగా చేసి.వారిని .టార్గెట్ చేయడమే ఇందులోని ఉద్దేశమని, అందుకే ఈ ప్రక్రియను వినియోగించుకుంటున్నారని ఆరోపించింది. దాదాపు ఇరవై లక్షల మంది ఏ రాష్ట్రానీకీ చెందనివారు కాకుండా పోతారు.
సరైన విధానమంటూ లేక చేబట్టిన ఈ ప్రాసెస్ కారణంగా వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారు అని ఈ కమిటీ కమిషనర్ అనురిమ భార్గవ పేర్కొన్నారు.
అస్సాంలో ముస్లిములను తరిమివేసేందుకు, వారిని ఏకాకులను చేసేందుకుఈ విధానాన్ని భారతీయ ‘ రాజకీయ నేతలు ‘ మాటిమాటికీ వినియోగించుకుంటున్నారని, పైగా వారికి వేర్వేరు పౌరసత్వ ప్రమాణాలను అమలు చేయడానికి ఎన్నార్సీ పరిధిని విస్తృతపరచాలని భావిస్తున్నారని అన్నారు. గతవారం ఈ అంశంపై కాంగ్రెస్ కమిటీ ముందు ఆయన ఈ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అటు-ఈ కమిటీ చైర్మన్ టోనీ పెర్కిన్స్ కూడా ఈ అభిప్రాయాలతో ఏకీభవించారు. భారత ప్రభుత్వం తన రాజ్యాంగం ప్రకారం అన్ని మైనారిటీ వర్గాల హక్కులను పరిరక్షించవలసిఉందన్నారు.
అయితే ఎన్నార్సీ ని అప్ డేట్ చేయడమన్నది సుప్రీంకోర్టు నిర్ణయమని, ఆ కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నడచుకుంటోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అసలు డేటాకు సంబంధించి ఎన్నార్సీ ఫారం లో దరఖాస్తుదారుని మతం గురించిన కాలమ్ ఎక్కడా లేదని ఈ శాఖ పేర్కొంది. కాగా-భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికాకు హక్కు ఎక్కడిదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

.
..