లాక్ డౌన్ కాలంలో లక్షల ఆదాయం… దమానీకే సాధ్యం

| Edited By: Anil kumar poka

Apr 08, 2020 | 2:00 PM

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండగా అనేకమంది పారిశ్రామిక దిగ్గజాల ఆదాయం కర్పూర హారతిలా హరించుకుపోతోంది. కస్టమర్లు రాక, కొనుగోళ్లు లేక బడా షాపింగ్ మాల్స్ వెలవెలబోవడంతో..వాటి యజమానులు దిగాలు పడిపోతున్నారు.

లాక్ డౌన్ కాలంలో లక్షల ఆదాయం... దమానీకే సాధ్యం
Follow us on

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండగా అనేకమంది పారిశ్రామిక దిగ్గజాల ఆదాయం కర్పూర హారతిలా హరించుకుపోతోంది. కస్టమర్లు రాక, కొనుగోళ్లు లేక బడా షాపింగ్ మాల్స్ వెలవెలబోవడంతో..వాటి యజమానులు దిగాలు పడిపోతున్నారు. కానీ ఎవెన్యూ సూపర్ మార్కెట్ల అధినేత రాధాకిషన్ దమానీ ఆదాయం మాత్రం అమాంతం పెరిగిపోతోంది. అత్యధిక కుబేరులైన 12 మంది భారతీయుల్లో ఈయన ఒకరయ్యారు. ఈ ఏడాది దమానీ ఆదాయం 10.2 బిలియన్ డాలర్ల మేర.. 5 శాతానికి పెరిగింది. ఎవెన్యూ సూపర్ మార్కెట్ల షేర్లు ఈ సంవత్సరం 18 శాతం హెచ్చుదలను నమోదు చేసుకున్నాయి. ఒకప్పుడు ముంబైలో ఓ చిన్న గదిలో నివాసం ఉంటూ వఛ్చిన రాధాకిషన్ నేడు బిలియనీర్ అయ్యారంటే.. ఆయన సూపర్ మార్కెట్ల చైనే  కారణం.. సుమారు 130 కోట్ల దేశ ప్రజలకు చుక్కలు చూపుతున్న మూడు వారాల లాక్ డౌన్,, దమానీ బిజినెస్ కి మాత్రం రెక్కలు తొడిగి దూసుకుపోయేలా చేస్తోంది. నిత్యావసర వస్తువులకోసం వేలాది ప్రజలు ఈ మార్కెట్లపై పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరిగినా పట్టించుకోకుండా కస్టమర్లంతా ‘ప్యానిక్’ తో వీటిపై ఎగబడ్డారు. కొనుగోళ్ళకు వెల్లువెత్తారు.

ఎవెన్యూ సూపర్ మార్కెట్ల సబ్సిడియరీ అయిన డీ-మార్ట్ చైన్ కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో 206 శాఖలున్నాయి. కరోనా నివారణకోసం దమానీ పీఎం కేర్స్ ఫండ్ కి 100 కోట్ల విరాళం ప్రకటించారు. గత ఫిబ్రవరిలో బిలియనీర్ ముకేశ్ అంబానీ తరువాత ఈయన రెండో బిలియనీర్ గా నిలిచారు.