కరోనా వైరస్..మూడు నగరాల్లో అత్యాధునిక టెస్టింగ్ కేంద్రాలు ?

| Edited By: Pardhasaradhi Peri

Jul 27, 2020 | 1:59 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో 49,931 నమోదయ్యాయి. దీంతో ఈ సంఖ్య 14,35,453 కి పెరిగింది. గత 24 గంటల్లో 708 మంది కరోనా రోగులు మృతి చెందారు. సుమారు తొమ్మిది లక్షల మంది కోలుకోగా..

కరోనా వైరస్..మూడు నగరాల్లో అత్యాధునిక టెస్టింగ్ కేంద్రాలు ?
Follow us on

దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో 49,931 నమోదయ్యాయి. దీంతో ఈ సంఖ్య 14,35,453 కి పెరిగింది. గత 24 గంటల్లో 708 మంది కరోనా రోగులు మృతి చెందారు. సుమారు తొమ్మిది లక్షల మంది కోలుకోగా.. రికవరీ రేటు 63.92 శాతం  ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ప్రధాని మోదీ సోమవారం మూడు ప్రధాన నగరాల్లో అత్యాధునిక టెస్టింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నారు. నోయిడా, ముంబై, కోల్ కతా నగరాల్లో వీటిని లాంచ్ చేయనున్నారని, ఈ కేంద్రాల ద్వారా టెస్టింగుల సంఖ్యను ఎంతగానో పెంచవచ్ఛునని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కెల్లా మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు వరుసలో ఉన్నాయి. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన 27 ఏళ్ళ యువ డాక్టర్ ఒకరు శనివారం రాత్రి మరణించారు. ఆయన సరిగ్గా గత జూన్ 27 న ఈ మహమ్మారికి గురయ్యారు.