‘ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు’.. కమల్ హాసన్ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 06, 2020 | 7:36 PM

తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా వైరస్ ని అదుపు చేయడంలో సీఎం పళనిస్వామి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోందని సినీ నటుడు, పొలిటీషియన్ కూడా అయిన కమల్ హాసన్ ఆరోపించారు. ఈ వైరస్..

ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. కమల్ హాసన్ ఫైర్
Follow us on

తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా వైరస్ ని అదుపు చేయడంలో సీఎం పళనిస్వామి ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోందని సినీ నటుడు, పొలిటీషియన్ కూడా అయిన కమల్ హాసన్ ఆరోపించారు. ఈ వైరస్ పై పోరుకు గాను ఆయన ‘సేవ్ చెన్నై’ పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ ని నియంత్రించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. అందువల్లే నేనీ ఉద్యమాన్ని మొదలు పెట్టాను’ అని చెప్పిన ఆయన.. కేరళ కన్నా ఈ రాష్ట్రంలో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగ్గా ఉందని, కానీ కోవిడ్-19 కంట్రోల్ లో ‘మిస్ మేనేజ్ మెంట్’ కారణంగా ఇక్కడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ పోరులో ప్రజలను భాగస్వాములను చేయలేకపోతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కమల్ హాసన్ మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలే బాధ్యత వహించి ఈ ప్రభుత్వానికి సాయపడాలని ఆయన కోరారు.