బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా( కలిసికట్టుగా) తాము పోటీ చేస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఎన్డీయే లోని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ఆయన చెప్పారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.వచ్ఛేనెల 28 నుంచి నవంబర్ 7 వరకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10 న ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో జేడీ-యూ, చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యం లోని ఎల్ జీపీ కొంతకాలంగా ఎడమొహం, పెడ మొహంగా ఉంటున్నాయి. జేడీయూపై తాము అభ్యర్థులను నిలబెడతామని ఎల్ జీపీ తెలిపింది. దీంతో బీహార్ లో ఎన్డీయే కి విచిత్రమైన సంకట పరిస్థితి తలెత్తింది.