సాయుధ దళాల వెంటే ఎంపీలు, ప్రధాని మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 14, 2020 | 12:41 PM

వాస్తవాధీన రేఖ వద్ద అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సాయుధ దళాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎంపీలంతా వారివెంటే ఉన్నారని అన్నారు. మన దేశ సార్వభౌమాధికారం, సమగ్రత విషయానికే వస్తే వీరంతా తాము భారత జవాన్ల..

సాయుధ దళాల వెంటే ఎంపీలు, ప్రధాని మోదీ
Follow us on

వాస్తవాధీన రేఖ వద్ద అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సాయుధ దళాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎంపీలంతా వారివెంటే ఉన్నారని అన్నారు. మన దేశ సార్వభౌమాధికారం, సమగ్రత విషయానికే వస్తే వీరంతా తాము భారత జవాన్ల వెంటే ఉంటామని గట్టి సందేశం ఇస్తున్నారని తను భావిస్తున్నానని ఆయన చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమావేశాలు ఏనాడూ ఎరుగని తరుణం వంటి టైం లో జరుగుతున్నాయని, కరోనా వైరస్ ఉన్నప్పటికీ సభ్యులంతా ‘డ్యూటీయే ఫస్ట్’ అన్నట్టు సమావేశాలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఎలాంటి విరామం లేకుండా వారం రోజులూ సభ జరగాలన్న ప్రభుత్వ సూచనను అందరూ అంగీకరించారని మోదీ తెలిపారు. ఈ కరోనా వైరస్ ని ధైర్యంగా  ఎదుర్కోవాలని సభ్యులు ముక్త కంఠంతో కోరుతున్నట్టు ఆయన చెప్పారు.