ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఆరుగురు మంత్రులూ.. రాజీనామా తాము తీసుకున్న సొంత నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడీ లేదన్నారు. ఈ మేరకు ఎవరికి వారు విడివిడిగా వీడియోలు రిలీజ్ చేశారు. సింధియా ఢిల్లీలో బీజేపీలో చేరిన వెంటనే ఇవి విడుదలై వైరల్ అయ్యాయి. తులసీ శిలావత్, గోవింద్ రాజ్ సింగ్ పుత్, మహేంద్ర సింగ్ శిశోడియా, ఇమార్తి దేవి, ప్రభురాం చౌదరి, ప్రద్యుమ్న సింగ్ తోమర్ అనే ఈ ఆరుగురూ తాము కమల్ నాథ్ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నామని వఛ్చిన వార్తలను తోసిపుచ్చారు. (సింధియా శిబిరంలోని మంత్రుల చేత మోసపూరితంగా రాజీనామాలు చేయించారని, బెంగుళూరులో ఉన్న వీరు తమ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారని కమల్ నాథ్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే).
కాగా ఈ ఆరుగురితో సహా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగుళూరులో ఉండగా..ఇతరులు వివిధ చోట్ల ఉన్నారు. వీరంతా రాజీనామాలు చేశారు.