వ్యాక్సిన్ తీసుకుని 24 గంటలయింది, ఐయామ్ ఫైన్, బీజేపీ ఎంపీ మహేష్ శర్మ, అంతా టీకామందు తీసుకోవాలని సూచన

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 6:38 PM

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైనదని  బీజేపీ ఎంపీ మహేష్ శర్మ అన్నారు. తను  నిన్న టీకామందు తీసుకున్నానని, 24 గంటలు గడిచాయని..

వ్యాక్సిన్ తీసుకుని 24 గంటలయింది, ఐయామ్ ఫైన్, బీజేపీ ఎంపీ మహేష్ శర్మ, అంతా టీకామందు తీసుకోవాలని సూచన
Follow us on

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైనదని  బీజేపీ ఎంపీ మహేష్ శర్మ అన్నారు. తను  నిన్న టీకామందు తీసుకున్నానని, 24 గంటలు గడిచాయని, అయినా  ఎలాంటి రియాక్షన్ కలగలేదని ఆయన చెప్పారు. యూపీ లోని గౌతమ బుధ్ధ నగర్ ఎంపీ అయిన ఈయన.. డాక్టర్, మాజీ కేంద్ర మంత్రి కూడా.. నోయిడాలో శనివారం వ్యాక్సిన్ తీసుకున్న మహేష్ శర్మ.. ప్రజలంతా టీకామందు తీసుకోవాలని సూచించారు. ఈ మహా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో టీకామందు తీసుకున్న రాజకీయ నేతల్లో ఈయన మొదటివారయ్యారు.  అలాగే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా మందుపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయని, కానీ వాటిని విడనాడాలని మహేష్ శర్మ పేర్కొన్నారు

ఇలా ఉండగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేబట్టినప్పుడు ప్రధాని మోదీ గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ ఎందుకు వ్యాక్సిన్ తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వారు మొదట తీసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలి కదా అంటున్నారు.