మహారాష్ట్రలో ‘నిర్బంధ క్వారంటైన్’.. స్టాంప్ ముద్ర తప్పదు !

| Edited By: Anil kumar poka

Mar 17, 2020 | 11:27 AM

కరోనా నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైన నేపథ్యంలో.. ఈ వైరస్ నివారణకు ఇంట్లో తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ లోనే ఉండాలని ప్రజలను ఆదేశించింది.

మహారాష్ట్రలో నిర్బంధ క్వారంటైన్.. స్టాంప్ ముద్ర తప్పదు !
Follow us on

కరోనా నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైన నేపథ్యంలో.. ఈ వైరస్ నివారణకు ఇంట్లో తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ లోనే ఉండాలని ప్రజలను ఆదేశించింది. అలా పంపిన వ్యక్తులపై స్టాంప్ ముద్ర వేయాలని ఉధ్ధవ్ థాక్రే సర్కార్ నిర్ణయించింది. హోం క్వారంటైన్ లో ఉన్న వారిని సులభంగా గుర్తించేందుకు వారి ఎడమ చేతిపై సిరాతో స్టాంప్ ముద్ర వేయనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ తెలిపారు. సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహారాష్ట్రలో 39 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు అనుమానిత కరోనా రోగులు చికిత్స తీసుకోకుండా పారిపోయారు. దీంతో సర్కార్ అప్రమత్తమైంది. ఎవరికైనా  కరోనా సోకితే అది నేరమేమీ కాదని, వారికి సరైన చికిత్స . సైకలాజికల్ సపోర్ట్ ఇస్తే త్వరలో పూర్తిగా కోలుకుంటారని ఆ మంత్రి చెప్పారు. మహారాష్ట్రలో జరగనున్న స్థానిక ఎన్నికలన్నింటిని మూడు నెలల పాటు వాయిదా వేశారు. స్టాంప్ ముద్ర వేయించుకోవడానికి ఎవరైనా నిరాకరించిన పక్షంలో వారిని తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యం లోని మెడికల్ ఫెసిలిటీకి పంపుతారు. కాగా- మతపరమైన కార్యక్రమాలకు తామేమీ అడ్డు చెప్పడంలేదని, కానీ భక్తులు పెద్ద సంఖ్యలో చేరకుండా చూడాలని ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే  అన్నారు.  అటు- ముంబైలోని సిద్దివినాయక ఆలయాన్ని నిరవధికంగా మూసి వేశారు.