కాంగ్రెస్ పార్టీ కలలు ‘కల్లలయ్యాయి’…హెచ్.డీ. కుమారస్వామి

| Edited By: Pardhasaradhi Peri

Jul 23, 2020 | 3:20 PM

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలవచ్చునని ఆశించిన కాంగ్రెస్ పార్టీ కలలు కల్లలయ్యాయని మాజీ సీఎం, జేడీ-ఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. సమీప భవిష్యత్తులొ పాలక బీజేపీ ప్రభుత్వాన్ని తాము అస్థిరపరచబోమన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లోగా బీజేపీ సర్కార్  తనంతట తానుగా కూలిపోవచ్ఛునని, అప్పుడు తాము అధికారంలోకి రావచ్చునని కాంగ్రెస్ నేతలు ఆశించారని, కానీ వారి ఆశలు అడియాసలయ్యాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారు చింతిస్తున్నారు.. అని అన్నారు. 2018 మధ్యకాలం నుంచి […]

కాంగ్రెస్ పార్టీ కలలు కల్లలయ్యాయి...హెచ్.డీ. కుమారస్వామి
Follow us on

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలవచ్చునని ఆశించిన కాంగ్రెస్ పార్టీ కలలు కల్లలయ్యాయని మాజీ సీఎం, జేడీ-ఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. సమీప భవిష్యత్తులొ పాలక బీజేపీ ప్రభుత్వాన్ని తాము అస్థిరపరచబోమన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లోగా బీజేపీ సర్కార్  తనంతట తానుగా కూలిపోవచ్ఛునని, అప్పుడు తాము అధికారంలోకి రావచ్చునని కాంగ్రెస్ నేతలు ఆశించారని, కానీ వారి ఆశలు అడియాసలయ్యాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారు చింతిస్తున్నారు.. అని అన్నారు. 2018 మధ్యకాలం నుంచి 2019 జులై వరకు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం గురించి కుమారస్వామి పరోక్షంగా ప్రస్తావించారు. అయితే ఆయన వ్యాఖ్యలను మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య తేలిగ్గా కొట్టిపారేస్తూ.. గతం గురించి ఇప్పుడు మాట్లాడినా ప్రయోజనం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇంకో ఏడాది అధికారంలో కొనసాగుతుందని ముక్తసరిగా పేర్కొన్నారు.