ఇండియాలో ఆర్ధిక మాంద్యం లేదు.. కానీ … ?

| Edited By: Anil kumar poka

Feb 01, 2020 | 11:37 AM

జీఎస్టీ, డీమానిటైజేషన్ వంటి చర్యల కారణంగానో, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఒడిదుడుకుల కారణంగానో ఇండియాలో గత ఏడాది ఆర్ధిక వృద్ది రేటు మందగించిందని, అయితే అది ఆర్ధిక మాంద్యానికి దారి తీయలేదని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. భారత పార్లమెంటుకు శనివారం ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ ను సమర్పిస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గత ఏడాది భారత ఎకానమీలో కొంతమేర తగ్గుదల కనిపించిందని, దీంతో తమ సంస్థ ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి […]

ఇండియాలో ఆర్ధిక మాంద్యం లేదు.. కానీ ... ?
Follow us on

జీఎస్టీ, డీమానిటైజేషన్ వంటి చర్యల కారణంగానో, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఒడిదుడుకుల కారణంగానో ఇండియాలో గత ఏడాది ఆర్ధిక వృద్ది రేటు మందగించిందని, అయితే అది ఆర్ధిక మాంద్యానికి దారి తీయలేదని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా తెలిపారు. భారత పార్లమెంటుకు శనివారం ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ ను సమర్పిస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గత ఏడాది భారత ఎకానమీలో కొంతమేర తగ్గుదల కనిపించిందని, దీంతో తమ సంస్థ ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి గ్రోత్ ప్రొజెక్షన్స్ ని 4 శాతానికి సవరించుకోవాల్సివచ్చిందని చెప్పారు. ఈ ఏడాది భారత వృద్ది రేటు 5.8 శాతం ఉంటుందని, వచ్ఛే సంవత్సరం ఇది 6.5 శాతానికి పెరగవచ్చునని ఆశిస్తున్నామని క్రిస్టలీనా అన్నారు. ఆర్ధిక వృద్ది తగ్గడానికి ప్రధాన కారణం బ్యాంకింగేతర సంస్థలు ఒడిడుకులకు లోనవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం కొన్ని దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టినా అవి స్వల్ప కాలిక ప్రయోజనాలను అందించాయన్నారు. ఏకీకృత పన్నుల విధానం, డీమానిటైజేషన్ వంటి చర్యలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఇండియాలో బడ్జెటరీ రెవిన్యూ టార్గెట్ కన్నా చాలా తక్కువగా ఉంది. ఇది పెరగవలసి ఉంది అని ఆమె చెప్పారు. రెవెన్యూ కలెక్షన్ తప్పనిసరిగా పెరగాలన్నారు.